byసూర్య | Mon, May 16, 2022, 09:15 PM
తెలంగాణలో గత 24 గంటల్లో 12,435 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 28 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. హైదరాబాద్లో ఎక్కువగా 18 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 62 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్త మరణాలు లేవు. తెలంగాణలో ఇప్పటివరకు 7,92,627 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,88,142 మంది ఆరోగ్యంగా ఉన్నారు. మరో 374 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మృతి చెందారు.