byసూర్య | Mon, May 16, 2022, 10:05 PM
పదో తరగతి పరీక్షలు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు.పరీక్షల నిర్వహణకు సంబంధించి సోమవారం ఆమె ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.తెలంగాణలో ఈ నెల 23 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని, జూన్ 1వ తేదీలోగా పరీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.