అపార్ట్మెంట్పై నుంచి పడి యువకుడు మృతి
byసూర్య |
Mon, May 16, 2022, 03:28 PM
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జగద్గిరిగుట్టలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఆర్డీకే అపార్ట్మెంట్ మూడో అంతస్తు మీద నుంచి పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు మృతి చెందిన వ్యక్తి గోపి(24)గా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
Latest News