byసూర్య | Mon, May 16, 2022, 03:29 PM
ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ శివారులో సోమవారం ఉదయం క్షత్రియ కాలేజ్ ముందు హైదరాబాద్ పెళ్లికి వెళ్తున్న మారుతి ఆల్టో కారు ఎపీ 28 బీఎల్ 8784 గల దానికి కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఆర్ జె 11జీసీ 5385 డ్రైవర్ నిర్లక్ష్యంగా నడుపుతూ కారుకి టక్కరు ఇవ్వగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ రోడ్డు ప్రమాదంలో కార్ లో ప్రయాణిస్తున్న జగిత్యాల జిల్ల వల్లంపల్లి గ్రామానికి చెందిన ఆనంద్ ( 25) మహేష్ (35 )నరేందర్ (35) అతని బార్య ఉమ (27) ఆలాగే మల్యాలకి చెందిన బుస్సీ రాజు (39) గాయపడినారు. మెరుగైన చికిత్స కోసం ఆనంద్, ఉమలను హైదరాబాద్ కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.