byసూర్య | Mon, May 16, 2022, 01:21 PM
రైలు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం మహబూబ్నగర్ రైల్వే పోలీసు స్టేషను పరిధిలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే మహబూబ్నగర్ పట్టణం హనుమాన్పురకు చెందిన సయ్యద్ ముఖ్తార్(52) పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో పట్టాలు దాటుతుండగా శనివారం రాత్రి గుర్తు తెలియని రైలు ఢీకొంది. తలకు తీవ్ర గాయాలై మృతిచెందాడు. అతడికి చెవులు సరిగ్గా వినబడవు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.