విగ్రహ ప్రతిష్ఠ, పూజాలో మంత్రి తలసాని శ్రీనివాస్
byసూర్య |
Fri, May 13, 2022, 05:02 PM
సికింద్రాబాద్ బన్సీలాల్ పేట లోని మెట్ల కమాన్ వద్ద గల శ్రీ శ్రీ మహంకాళి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం అనంతరం విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ఠ, పూజా కార్యక్రమాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత తదితరులు ఉన్నారు.
Latest News