బండి సంజయ్‌ పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

byసూర్య | Fri, May 13, 2022, 05:21 PM

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. న్యాయవాది చేత బండి సంజయ్‌ కి కేటీఆర్ నోటీసులు పంపించారు. ఈనెల 11న ట్విట్టర్‌ లో తనపై బండి సంజయ్ ఆరోపణలు చేశారని కేటీఆర్‌ అన్నారు. ఆరోపణలపై ఆధారాలు ఉంటే చూపించాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దురుద్దేశంతోనే బండి సంజయ్‌ అబద్ధాలు చెప్పారని కేటీఆర్‌ న్యాయవాది అన్నారు. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలను కేటీఆర్‌ కి ఆపాదించారని తెలిపారు. సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం కేటీఆర్‌ కి పరిహారం చెల్లించాలని పేర్కొన్నారు. 48 గంటల్లో కేటీఆర్‌ కి క్షమాపణ చెప్పాలన్న న్యాయవాది డిమాండ్ చేశారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM