byసూర్య | Sun, Jan 16, 2022, 12:00 PM
యాదాద్రి భువనగిరి జిల్లా: సంస్థాన్ నారాయణపురం మండలం అల్లందేవిచెరువు గ్రామ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో అంజిరెడ్డి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్తుండగా దొంగలు తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాలో ఉన్న ఆరు తులాల బంగారం, లక్షా యాభై వేల నగదు అపహరణకు గురైనట్లు ఇంటి యజమాని అంజిరెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రం చూసేందుకు వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై నారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.