byసూర్య | Thu, Jan 13, 2022, 09:17 PM
బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు తారా స్థాయికి చేరుకున్నాయని కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బీజేపీలో ఐకమత్యం లేదని ఆయన అన్నారు. తెలంగాణ బీజేపీలో అసంతృప్త కుమ్ములాటలు మొదలయ్యాయని... రాబోయే రోజుల్లో ఈ విభేదాలు మరింత ముదురుతాయని చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కరీంనగర్ బీజేపీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారని. ఈ సమావేశంపై బండి సంజయ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి రావడం సంజయ్ కు ఇష్టం లేదని అన్నారు. కేసీఆర్ ను జైలుకు పంపిస్తామని బండి సంజయ్ అంటున్నారని... ఏ ప్రాతిపదికన కేసీఆర్ ను జైలుకు పంపిస్తారో ఆయన చెప్పాలని డిమాండ్ చేశారు.