byసూర్య | Thu, Jan 13, 2022, 09:17 PM
దేశంలో పెరుగుతున్న ఎరువుల ధరల భారాన్ని కేంద్ర ప్రభుత్వం భరించాలని ఎమ్మెల్యే గాదరి కిషోర్ డిమాండ్ చేశారు.రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న ప్రధాని మోదీకి దేశవ్యాప్తంగా రైతుల తరుపున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారన్నారు. 2016లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చిన మోదీ వ్యవసాయ పెట్టుబడి ఆదాయం కంటే రెట్టింపు చేశారని ఆరోపించారు. ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతులపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.