ఆ కేసులో 102 మందిని విచారించనున్న కోర్టు

byసూర్య | Wed, Jan 12, 2022, 07:08 PM

ప్రణయ్ హత్య కేసులో విచారణ చేపట్టిన కోర్టు దాదాపు 102 మందిని విచారణ చేయనున్నది. ఇదిలావుంటే దేశంలోనే తీవ్ర చర్చకు దారితీసిన మిర్యాలగూడ పరువు హత్య.. ప్రణయ్ మర్డర్ కేసులో విచారణ ప్రారంభమైంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నారన్న కోపంతో కూతురు అమృత భర్త ప్రణయ్‌ను 2018 సెప్టెంబర్ 14న ఆమె తండ్రి మారుతీరావు కిరాయి హంతకులతో దారుణంగా హత్య చేయించారు. ఆస్పత్రికి వెళ్లొస్తున్న భార్యాభర్తలను వెంటాడిన దుండగులు వెనక నుంచి వచ్చి అమాంతం ప్రణయ్‌ను కత్తితో నరికి చంపేశారు. ఈ ఘటన అప్పట్లో పెనుసంచలనమైంది. పరువు కోసమంటూ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకున్న మారుతీరావుపై సమాజం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత రెండేళ్లకే మారుతీరావు 2020 మార్చిలో హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. 2018లో జరిగిన ప్రణయ్ మర్డర్ కేసులో ఇప్పటికే 102 మంది సాక్షులను విచారించాల్సి ఉంది. గతేడాదే జిల్లా ఎస్సీ, ఎస్టీ చట్టాల ప్రత్యేక కోర్టు విచారణ చేపట్టాల్సి ఉన్నప్పటికీ కోవిడ్ కారణంగా సాధ్యం కాలేదు. ఈ నెల 3 వతేదీ నుంచి కోర్టు విచారణ చేపట్టింది. ఒకరి తర్వాత మరొకరు చొప్పున 102 మంది సాక్షులను కోర్టు విచారణ జరపనుంది. అందులో భాగంగా ఇప్పటికే కుటుంబ సభ్యుల వాంగ్మూలం నమోదు చేసుకుంది న్యాయస్థానం. ప్రణయ్ తండ్రి బాలస్వామి, తల్లి ప్రేమలత, భార్య అమృత స్టేట్‌మెంట్ రికార్డ్ చేసుకున్నారు. సాక్షుల విచారణ జరగాల్సి ఉంది. ఈ కేసులో ఎనిమిది మందిని నిందితులుగా చేర్చారు. ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీ రావు మరణంతో మరో ఏడుగురు నిందితులు కేసు విచారణ ఎదుర్కొంటున్నారు.


Latest News
 

మేడిగడ్డ బ్యారేజీ రెండు గేట్లను పూర్తిగా తొలగించండి: నిపుణుల కమిటీ Wed, May 08, 2024, 08:01 PM
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక..బీజేపీ అభ్యర్థి ప్రకటన.. టఫ్ ఫైట్ ఖాయం Wed, May 08, 2024, 07:57 PM
ఎవరితో ఎవరు.. లోక్‌సభ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీల అభ్యర్థులు వీరే.. Wed, May 08, 2024, 07:48 PM
ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఆర్ఆర్ ట్యాక్స్‌ వసూళ్లు మించిపోయాయి: ప్రధాని మోదీ Wed, May 08, 2024, 07:42 PM
కాంగ్రెస్‌లో 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు,,,,,మంత్రి కోమటిరెడ్డి Wed, May 08, 2024, 07:37 PM