ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఆర్ఆర్ ట్యాక్స్‌ వసూళ్లు మించిపోయాయి: ప్రధాని మోదీ

byసూర్య | Wed, May 08, 2024, 07:42 PM

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ప్రచార గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు సభలు, సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం ఏర్పాటు చేసిన వేములవాడ, వరంగల్ బహిరంగ సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.


అవినీతిలో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధమని దుయ్యబట్టారు. ప్రజల ముందు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుంటారని.. తెరవెనుక మాత్రం అవినీతి సిండికేట్‌గా మారుతారని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపించించగా.. అధికారంలోకి వచ్చాక ఆ అవినీతిపై దర్యాప్తు చేయట్లేదని అన్నారు. తెలంగాణ నుంచి ఢిల్లీ వరకు దేశవ్యాప్తంగా ఆర్‌ఆర్‌ ట్యాక్సుపైనే చర్చ జరుగుతోందని మోదీ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ఆర్ఆర్ ట్యాక్స్‌ వసూళ్లు మించిపోయాయాన్నారు. తెలంగాణలోని ఆర్‌ లూటీ చేసి.. ఢిల్లీలోని ఆర్‌కు ఇస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రజలు బుద్ధి చెబుతారని అని మోదీ అన్నారు.


అమెరికాలో యువరాజు రాహుల్ అంకుల్ పిట్రోడా ఉంటారని.. చర్మం రంగు నల్లగా ఉన్నవారు ఆఫ్రికావారాని ఆ ఆంకుల్ ఆయనకు చెప్పారన్నారు. చర్మం రంగును చూసి తీవ్రంగా తిట్టారని.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆఫ్రికన్ అనేలా మాట్లాడారని మోదీ నిప్పులు చెరిగారు. అందుకే కాంగ్రెస్ ముర్మును ఓడించడానికి ప్రయత్నించిందని కీలక కామెంట్స్ చేశారు. రాష్ట్రపతిగా మేం ద్రౌపది ముర్మును నిలబెడితే.. కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందో అర్థం కాలేదని మోదీ వ్యాఖ్యనించారు.


దేశంలో, రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను తగ్గించి.. వాటిని ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తొందని మోదీ ఆరోపించారు. అలాగే బీ రిజర్వేషన్లను ఇండియా కూటమి హరించాలని చూస్తుందన్నారు. గత కొన్నేళ్లుగా మాదిగ సమాజం తన హక్కుల కోసం పోరాడుతొందని.. మాదిగల రిజర్వేషన్లపై తాము ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటానని అన్నారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమికి పరాభవమేనని.. మిగిలిన నాలుగు విడతల్లోనూ బీజేపీ, ఎన్డీయే కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారని చెప్పారు. కాగా, వేములవాడ సభ ప్రారంభానికి ముందు మోదీ శ్రీరాజరాజేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM