గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక..బీజేపీ అభ్యర్థి ప్రకటన.. టఫ్ ఫైట్ ఖాయం

byసూర్య | Wed, May 08, 2024, 07:57 PM

వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని తమ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం ఆయన బీజేపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆయన నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేశారు. ఇలా మూడు పార్టీల నుంచి ముగ్గురు బలమైన అభ్యర్థులు నిలవటంతో పోటీ రసవత్తరం కానుంది.


వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి 2021లో ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. అయితే గతేడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది.


మే 2 ఈ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 9 వరకు నామినేషన్ల స్వీకరణకు, 10 పరిశీలన, 13న ఉపసంహరణకు చివరి తేదీలుగా ప్రకటించింది. ఉప ఎన్నికల పోలింగ్ మే 27న ఉదయం 8 నుంచి సాయంత్రం నాలుగు వరకు జరగనుండగా.. జూన్ 5న కౌంటింగ్ ఉంటుందని ఈసీ వెల్లడించింది.


Latest News
 

తెలంగాణలో ఆ 2 జిల్లాల పేర్లు మార్పు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన Sun, May 19, 2024, 09:04 PM
హైదరాబాద్‌వాసులారా జాగ్రత్త.. ఫేమస్ రెస్టారెంట్లలో కూడా ఇంత దారుణమా Sun, May 19, 2024, 07:51 PM
రాజీనామా చేసేందుకు సిద్ధం.. మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన ప్రకటన Sun, May 19, 2024, 07:50 PM
వాళ్లను దూరం చేసుకోవటమే మేం చేసిన తప్పు: కేటీఆర్ Sun, May 19, 2024, 07:42 PM
అవిశ్వాసం నెగ్గిన బీఆర్ఎస్,,,12 మందిలో అవిశ్వాసానికి మద్దతుగా 11 మంది కౌన్సిలర్లు Sun, May 19, 2024, 07:41 PM