byసూర్య | Wed, Jan 12, 2022, 05:05 PM
సికింద్రాబాద్లోని జీహెచ్ఎంసీ ఆఫీస్ లో అగ్నిప్రమాదం జరిగింది. జీహెచ్ఎంసీ ఆఫీస్ మూడో అంతస్తులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. దాంతో పొగ దట్టంగా కమ్ముకుంది. ఈ ప్రమాదంతో సిబ్బంది తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది రాకతో మంటలు అదుపులోకి వచ్చాయి. అగ్నిప్రమాదంలో పలు పత్రాలు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు.