byసూర్య | Wed, Jan 12, 2022, 04:50 PM
తెలంగాణ ఉపాధ్యాయుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించొద్దు అని ఈటల రాజేందర్ నేడు సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇతర రాష్ట్రాల నేతలను పిలిచి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు చనిపోతున్నా కేసీఆర్ పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. ఉపాధ్యాయులను పిలిపించి భరోసా ఇవ్వాల్సిన సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతలతో రాజకీయాలపై దృష్టి సారిస్తున్నారన్నారు. ఉపాధ్యాయుల పట్ల దురుసుగా ప్రవర్తించొద్దని,వారి మరణానికి కారణం అవ్వొద్దని ఈటల రాజేందర్ సూచించారు.