byసూర్య | Tue, Oct 26, 2021, 03:52 PM
హైదరాబాద్లోని చందానగర్లో ప్రియురాలి హత్య కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ప్రియురాలు నాగ చైతన్యను ప్రియుడు కోటిరెడ్డి హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 23 తేదీన ఈ ప్రేమజంట నల్లగండ్లలోని ఓయో రూమ్కి వచ్చింది. అదే రోజు రాత్రి నాగ చైతన్యను కోటిరెడ్డి గొంతు కోసి హత్య చేశాడు. ఆ తరువాత ఒంగోలు వెళ్లి ఆత్మహత్యాయత్నం చేశాడు. నాగ చైతన్యను హత్య విషయం వెలుగులోకి వస్తదనే భయంతోనే కోటిరెడ్డి కడుపులో పొడుచుకొని ఆత్మహత్య యత్నం చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కోటిరెడ్డి ఒంగోలులోని రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్యం మెరుగైన తరువాత పోలీసులు హైదరాబాద్కి తీసుకురానున్నారు.