byసూర్య | Tue, Oct 26, 2021, 03:55 PM
మాజీ మంత్రి ఈటల రాజేందర్ నేడు కమలాపూర్, గూడూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈటలను చూసి ప్రజలు కంటతడి పెట్టుకున్నారు. వారిని చూసి ఈటల సైతం భావోద్వేగానికి గురయ్యారు. కేసీఆర్ కష్టాల్లోకి నెట్టాడా బిడ్డా అంటూ స్థానిక మహిళలు కంట తడిపెట్టారు. టీఆర్ఎస్కే ఓటేయాలని ఒత్తిడి తెస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటలకే అండగా ఉంటామని, బాధ పడొద్దని భరోసా ఇచ్చారు.