byసూర్య | Tue, Oct 26, 2021, 02:30 PM
న్యూఢిల్లీ : ఒప్పో న్యూ ఏ సిరీస్ 5జీ ఫోన్ ఏ56 5జీని లాంఛ్ చేసింది. 5జీ కనెక్టివిటీతో పాటు మెరుగైన సామర్ధ్యం కోసం న్యూ ఏ సిరీస్ ఫోన్లో మీడియాటెక్ డెమెన్సిటీ ప్రాసెసర్ను చైనా కంపెనీ తీసుకువచ్చింది. ఏ55 5జీకి కొనసాగింపుగా ఏ56 5జీని ఒప్పో లాంఛ్ చేసింది. ప్రస్తుతం చైనాలో ఏ56 5జీని ఒప్పో లాంఛ్ చేయగా త్వరలోనే భారత్లోనూ ఈ స్మార్ట్ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది.ఇక ఒప్పో ఏ56 5జీ ఫోన్ దాదాపు రూ 18,800కు అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ బ్లాక్, పర్పుల్, బ్లూ కలర్స్లో లభిస్తుంది. ఈ ఫోన్ 6.5 ఇంచ్ హెచ్డీ ఎల్సీడీ డిస్ప్లేతో సెల్ఫీల కోసం 8 మెగాపిక్సెల్ కెమెరాతో అందుబాటులో ఉంది.