byసూర్య | Tue, Oct 26, 2021, 02:30 PM
హైదరాబాద్లోని ఓ హోటల్లో బీసీ సంఘాల రాష్ట్ర స్థాయి నేతలు సమావేశమయ్యారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో బీసీ వ్యతిరేకులకు గుణ పాఠం చెప్పాలని నిర్ణయించారు. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించాలని బీసీ సంఘాలు అల్టిమేటం జారీ చేశాయి. జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించాయి. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ను ఓడించాలని హుజురాబాద్ ఓటర్లకు ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. సమావేశంలో వివిధ ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.