తహసీల్దార్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్

byసూర్య | Tue, Oct 26, 2021, 10:43 AM

 జోగులళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల తహసీల్దార్ ఆఫీసులో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో తహసీల్దార్ కార్యాలయంలోని పలు ఫైళ్లు, కీలక రికార్డులు దగ్ధం అయినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు.మానవపాడు తహసీల్దార్ ఆఫీసులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ ఫైర్ యాక్సిడెంట్ లో పలు కీలకమైన ఫైళ్లు దగ్ధం అయినట్లు ప్రచారం జరుగుతుండటం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఘటన జరిగిన సమాచారం తెలిసి కూడా అధికారులు వెంటనే ఆఫీసుకు రాకపోవడం గమనార్హం. తహసీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంతో స్థానికుల్లో ఆందోళన చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM