byసూర్య | Tue, Oct 26, 2021, 10:51 AM
లాడ్జిలో ఓ యువతి అనుమానాస్పదస్థితిలో మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ లోని శేరిలింగంపల్లి పరిధిలో చందానగర్లో చోటుచేసుకుంది. ఒంగోలుకు చెందిన కోటిరెడ్డి మెడికల్ రెప్రజెంటేటివ్గా చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన నాగ చైతన్యను అతను ప్రేమించాడు. నాగ చైతన్య ఒక ప్రయివేటు ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. ఆమె కూడా అతన్ని ప్రేమించినట్టు తెలుస్తోంది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు పెండ్లికి నిరాకరించరని, ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నామని కోటి రెడ్డి చెబుతున్నాడు. యువతితో కలిసి కోటిరెడ్డి చందానగర్లోని లాడ్జిలో దిగాడు. ఉదయం తలుపులు తెరవకపోవడంతో లాడ్జి సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు.వారు వచ్చి గది తలుపులు తెరిచి చూడగా యువతి మృతదేహం కనిపించింది. కాగా కోటిరెడ్డి లాడ్జి నుంచి అదృశ్యమయ్యాడు. అతను గాయాలతో ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో చేరాడు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దలు అంగీకరించకపోవడంతోనే ఆత్మహత్యాయత్నం చేసినట్టు అతను చెబుతున్నాడు. కేసు నమోదు చేసుకుని హత్యా? ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.