నార్సింగి వద్ద రోడ్డు ప్రమాదం..

byసూర్య | Tue, Oct 26, 2021, 09:49 AM

రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా వెళ్తున్న కారు ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన నార్సింగి మీర్జాగూడ చౌరస్తాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి మీర్జాగూడ చౌరస్తా వద్ద ఓ మహిళ రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీ కొట్టింది. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.డ్రైవర్ రామకృష్ణా రెడ్డి .. కారును వదిలేసి వెళ్తుండగా స్థానికులు అప్రమత్తమయ్యారు. అతన్ని వెంబడించి పట్టుకుని దేహ శుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతురాలు అదే ప్రాంతానికి చెందిన పద్మగా గుర్తించారు. డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Latest News
 

గులాబీ పార్టీ చరిత్రలో ఇదే తొలిసారి.. కేసీఆర్ ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా లేరు Fri, Apr 26, 2024, 08:37 PM
కేఏ పాల్ కాఫీకి రమ్మంటే వెళ్లా,,కండువా కప్పి పార్టీ అధ్యక్షుడి పదవి ఇచ్చారు Fri, Apr 26, 2024, 08:33 PM
రైతులకు రుణమాఫీ చేయలేకపోతే మాకు అధికారమెందుకు,,,హరీశ్ రాజీనామా లేఖ సిద్ధంగా పెట్టుకో Fri, Apr 26, 2024, 08:27 PM
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ Fri, Apr 26, 2024, 08:23 PM
వికారాబాద్‌ యువకుడికి సివిల్స్‌ ర్యాంక్.. ఘనంగా సన్మానాలు, చివరికి షాకింగ్ ట్విస్ట్ Fri, Apr 26, 2024, 08:19 PM