byసూర్య | Tue, Oct 26, 2021, 09:50 AM
బూర్గంపాడు మండలంలో గంజాయి తాగుతున్న యువకులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. సారపాకలోని ఓ ప్రాంతంలో గంజాయి తాగుతున్నారనే సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రమేశ్, సాకీర్, రోహిత్, రామాంజనేయులు, స్వరూప్లను అదుపులోకి తీసుకుని వీరి నుంచి రూ. 10 వేల విలువైన 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశాలో ఓ వ్యక్తి నుంచి దీన్ని కొనుగోలు చేసినట్లు, నిందితులను రిమాండక్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.