ఘోరం.. మంటల్లో కాలిపోయిన కారు, గర్భిణి మృతి

byసూర్య | Tue, Oct 26, 2021, 09:48 AM

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారుని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో కారు పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. యాక్సిడెంట్‌తో కారులో మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో గర్భిణి మృతి చెందింది. షాద్ నగర్ పరిధిలోని జాతీయ రహదారి బైపాస్‌పై సోమ‌వారం తెల్లవారుజామున ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. షాద్‌నగర్ వైపు వస్తున్న కారుని గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో పొదల్లోకి దూసుకెళ్లింది. పెట్రోల్ లీకై మంటలు చెలరేగడంతో కారు పూర్తిగా కాలిపోయింది. ప్రమాదంలో శైలజ అనే గర్భిణి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మంటల్లో కారు కాలిపోతున్న వీడియోలు భయానకంగా ఉన్నాయి. మృతురాలి భర్త సురేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM