byసూర్య | Tue, Oct 26, 2021, 09:16 AM
తాజాగా ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని పెంచింది. తాజాగా మరో శుభవార్త ప్రకటించింది. కొంతమంది ఉద్యోగులకు వేతనాలపై ప్రత్యేక ఇంక్రిమెంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ పెంపుతో ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఈ ఇంక్రిమెంట్ ప్రయోజనం 7వ పే కమిషన్ పే మ్యాట్రిక్స్ కి సంబంధించి 6 వ స్థాయి అధికారులకు కేటాయించారు. ఈ ర్యాంక్ ఉన్న అధికారుల జీతంలో గణనీయమైన పెరుగుదల ఉంటుంది. జీతం పెరిగిన అధికారులు మిలటరీ అర్రైర్స్ విభాగంలో పనిచేస్తున్నారు. మీడియా నివేదిక ప్రకారం.. లెవెల్ 5A, లెవెల్ 10A, లెవెల్ 10B, లెవెల్ 12A, లెవెల్ 12B , లెవెల్ 13B అధికారులు ప్రత్యేక ఇంక్రిమెంట్ ప్రయోజనం పొందుతారు. ఈ అధికారుల వ్యక్తిగత చెల్లింపులను ప్రభుత్వం పెంచింది.