దగ్ధమైన స్కూల్ బస్సు

byసూర్య | Tue, Oct 26, 2021, 09:13 AM

పెట్టిన ప్రదేశంలోనే స్కూల్ బస్సు దగ్ధమైన సంఘటన వికారాబాద్ పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వికారాబాద్ పట్టణంలోని న్యూ గీతాంజలి పాఠశాల కు చెందిన స్కూల్ బస్సు ఏపీ 15 వై 2580 ఎప్పటి మాదిరిగానే స్కూల్ సమీపంలో పెట్టగా మంగళవారం తెల్లవారుజామున మూడున్నర గంటల ప్రాంతంలో మంటలు అంటుకొని దగ్ధమైంది. మంటలు అంటుకోవడంతో గమనించిన స్థానికులు స్కూల్ యజమాని చంద్రశేఖర్ కు సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేయడం తో అక్కడికి చేరుకున్న ఫైర్ ఇంజన్ మంటలను అర్పారు. బస్సు పై భాగం లోపల సీట్లు పూర్తిగా కాలిపోయాయి. సంఘటన స్థలానికి పోలీసులు సైతం చేరుకొని వివరాలు సేకరించారు.

Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM