27న తెలంగాణ బంద్‌కు మావోల పిలుపు

byసూర్య | Tue, Oct 26, 2021, 08:18 AM

ములుగు జిల్లా టేకులగూడ అడవిలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్‌గా సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ ప్రకటించారు. నిన్న జరిగిన ఎన్ కౌంటర్ లో రీజనల్ సెంటర్ సీఆర్సీ కంపెనీ-2కు చెందిన కామ్రేడ్ నరోటి దామాల్, మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా గట్ట ప్రాంతానికి చెందిన పూనెం భద్రు, బీజాపూర్ జిల్లా పెద్దకోర్మ గ్రామానికి చెందిన సోడి రామాల్ అలియాస్ సంతోష్, బీజాపూర్ జిల్లా బాసగూడెం ప్రాంతం మల్లిపాడుకుచెందిన మరో కామ్రేడ్ మరణించినట్టుగా జగన్ తెలిపారు. ములుగు జిల్లా టేకులగూడ బోగస్ ఎన్ కౌంటర్‌కు నిరసనగా నవంబర్ 27న తెలంగాణ బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చినట్టుగా ఆయన పేర్కొన్నారు. అమాయకులని పట్టుకుని అడవిలోకి తీసుకెళ్లి కాల్చి చంపారని జగన్ తన ప్రకటనలో పేర్కొన్నారు.


Latest News
 

మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో ఇద్దరి మృతి Thu, May 02, 2024, 05:01 PM
ఈవీఎంల అనుబంధ ర్యాండమైజేషన్ పూర్తి: జిల్లా కలెక్టర్ Thu, May 02, 2024, 04:56 PM
దేశం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించాలి Thu, May 02, 2024, 04:50 PM
పెద్దమందడిలో బిఆర్ఎస్ నాయకుల ప్రచారం Thu, May 02, 2024, 04:33 PM
క్షణికావేశంలో భార్యను చంపిన భర్త Thu, May 02, 2024, 04:31 PM