రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టిన పోలీస్ శాఖ

byసూర్య | Tue, Oct 26, 2021, 08:20 AM

తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ డీజీపీ కార్యాలయం స్పందించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టింది. అవన్నీ నిరాధార ఆరోపణలని పేర్కొంటూ డీజీపీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘డీజీపీ, మంత్రుల ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారని, ఉన్నతాధికారుల మధ్య విభేదాలు ఉన్నాయనేది అవాస్తవం. అన్ని విభాగాల మధ్య మంచి సమన్వయం ఉంది. ప్రతిభ, సామర్థ్యం ఆధారంగానే పోలీసు శాఖలో పోస్టింగులు ఇచ్చాం. నిరాధార ఆరోపణల వల్ల పోలీసుల ఆత్మస్థైర్యం, మనోధైర్యం దెబ్బతింటుంది. మావోయిస్టులు ఉంటే బాగుండేదని రేవంత్‌ అనటం సరైంది కాదు. ప్రజాప్రతినిధులను కూడా మావోయిస్టులు బలితీసుకున్నారు. మావోయిస్టుల ఏరివేతలో 350 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయి. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు సమాజంలో శాంతిభద్రతలపై తీవ్ర ప్రభావం చూపించే ప్రమాదముంది. ఇండియన్ టెలిగ్రాఫ్‌ యాక్ట్ ప్రకారమే పోలీసు శాఖ నడుచుకుంటోంది. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రాజ్యాంగబద్ధంగా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు’’ అని డీజీపీ కార్యాలయం తెలిపింది.


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM