byసూర్య | Sun, Oct 24, 2021, 06:13 PM
నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ గంగాధర్, ఎస్ఐ లక్ష్మణ్పై సస్పెన్షన్ వేటు పడింది. ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. ఇద్దరిపై తీవ్రమైన భు వివాదాలు, అవినీతి ఆరోపణలు రావడంతో ఈ మేరకు సస్పెండ్ చేశారు. నార్సింగ్ పీఎస్ పరిధిలోని పలు భూ వివాదంలో ఇన్స్పెక్టర్ గంగాధర్ తల దూర్చారు. జన్వాడలోని ఓ భూమి విషయంలో కూడా ఆయన ప్రమేయం ఉండడంతో బాధితుడు రవీందర్ రెడ్డి సైబరాబాద్ సీపీకి నేరుగా ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ జరిపిన ఆయన గంగాధర్తో పాటు ఎస్ఐ లక్ష్మణ్ను సస్పెండ్ చేశారు.