byసూర్య | Sun, Oct 24, 2021, 06:04 PM
నల్లగొండ పట్టణంలోని నడిబొడ్డున భారీ చోరీ జరిగింది. పట్టపగలు లక్ష్మీనగర్ కాలనీలో దొంగలు హాల్ చల్ చేశారు. ఇంటి తాళాలు పగులగొట్టి 15 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు దోచుకుపోయారు. నల్గొండ ఎమ్మెల్యే, ఎంపీల నివాసాలకు దగ్గరలోని ఓ ఇంట్లో చోరీ జరిగడంతో స్థానికులు భయపడుతున్నారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కాగా అమెరికా వెళ్లేందుకు బాధిత కుటుంబం డబ్బులు సమకూర్చుకున్నట్లు సమాచారం.