byసూర్య | Sun, Jun 06, 2021, 02:05 PM
తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించిన మరుసటి రోజు నుంచే సీఎం కేసీఆర్పై వైఎస్ షర్మిల ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు. రోజుకో ట్వీట్ చేస్తూ కేసీఆర్పై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. తాజాగా కేసీఆర్పై మరో దుమారం రేపే ట్వీట్ చేశారు. 'తలాపున సముద్రమున్నా చాప దూపటికేడ్చినట్టు. వ్యాక్సిన్ల తయారీ సంస్థలు గీడనే ఉన్నా మీకు మాత్రం దొరకటం లేదా? ప్రభుత్వాస్పత్రుల్లో ఫస్ట్ డోస్ బందుపెట్టి నెలరోజులైంది. ప్రైవేట్కు మాత్రం దొరుకుతున్నయ్. ఇప్పటికైనా మీ రీతి మార్చుకొని, ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించండి. ప్రభుత్వానికి దొరకని కరోనా వ్యాక్సిన్లు ప్రైవేట్కు ఎలా దొరుకుతున్నయి కేసీఆర్ సారూ...? మీకు చేతకాకనా? ప్రజల ప్రాణాలంటే పట్టింపు లేకనా? కమీషన్లకు ఆశపడా? లేక వ్యాక్సిన్ల భారం తగ్గించుకునేందుకా? ఇంకెన్నాళ్లు దొరా మూతకండ్ల పరిపాలన..?' అని కేసీఆర్పై షర్మిల ఘాటు ట్వీట్ చేశారు. కాగా.. కేసీఆర్ గురించి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా, బహిరంగ సభలో విమర్శలు గుప్పించినా.. ట్విట్టర్ వేదికగా ఈ రేంజ్లో విమర్శనాస్త్రాలు గుప్పిస్తున్నా ఇంతవరకూ గులాబీ బాస్ నుంచి ఒక్కసారి కూడా రియాక్షన్ రాలేదు.