వేధింపులు తాళలేక డిగ్రీ విద్యార్థిని బలవన్మరణం

byసూర్య | Sun, Jun 06, 2021, 01:35 PM

తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఘోరం చోటుచేసుకుంది. వేధింపులు తాళలేక ఓ డిగ్రీ విద్యార్థిని పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం హర్కాపూర్‌లో జరిగింది. హర్కాపూర్‌ గ్రామానికి చెందిన రాథోడ్ శ్రీదేవి (21) డిగ్రీ చదువుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఇంట్లో పురుగుల మందు తాగి అనుమానాస్పదంగా బలవన్మరణానికి పాల్పడింది. అయితే.. తన సోదరి మృతికి తన భార్య, అత్త వేధింపులే కారణమని మృతురాలి అన్న ఇంద్రవెల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు పలు వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇంద్రవెల్లి పోలీసులు పేర్కొన్నారు. అయితే.. అత్త , భార్య వేధింపుల కారణంగానే యువతి ఆత్మహత్యకు పాల్పడిందా లేదా మరేదైనా కారణం ఉందా.? అన్న కోణంలో పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.


Latest News
 

బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా తాటికొండ రాజయ్య? Fri, Mar 29, 2024, 03:11 PM
సీఎం రేవంత్ ను కలిసిన కేకే Fri, Mar 29, 2024, 03:08 PM
నిప్పంటించుకుని యువకుని ఆత్మహత్య Fri, Mar 29, 2024, 02:56 PM
ప్రజల సౌకర్యార్థం బోరును తవ్వించినవి కాంగ్రెస్ నాయకులు Fri, Mar 29, 2024, 02:55 PM
కాంగ్రెస్ పార్టీ జువ్వాడి గ్రామ కమిటీ ఎన్నిక Fri, Mar 29, 2024, 02:52 PM