byసూర్య | Sun, Jun 06, 2021, 10:59 AM
తెలంగాణ ఉద్యమకారులపై ఒత్తిడి తెచ్చి పార్టీలో చేర్చుకోవడం.. తర్వాత వారిని అనుమానించడం, అవమానించడం, సాగనంపడం, కక్షగట్టడం, శిక్ష వేయడం.. ఇవి సీఎం కేసీఆర్ దినచర్యలో భాగమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎ్సఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఆలె నరేంద్ర నుంచి ఈటల రాజేందర్ వరకూ ఆయనది ఇదే వైఖరన్నారు. సీఎం కేసీఆర్ తదుపరి టార్గెట్ హరీశ్రావు అని జోస్యం చెప్పారు.