byసూర్య | Tue, Apr 06, 2021, 05:16 PM
తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. సీఎస్ సోమేష్ కుమార్ సోమవారం సీఎం కేసీఆర్ తో పాటు పలువురు మంత్రులు,అధికారులతో భేటి అయ్యారు. దీంతో వారందరిలో ఆందోళన నెలకొంది. సీఎస్ కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. సీఎం కేసీఆర్ కూడా సీఎస్ కాంటాక్టులో ఉండడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.