byసూర్య | Wed, Mar 31, 2021, 10:33 AM
హైదరాబాద్ : శంషాబాద్లోని రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పెద్ద ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి వచ్చిన ప్రయాణికుల నుంచి 2.5 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. వైర్లు కట్ చేసే పరికరాల్లో దాచి బంగారాన్ని తరలిస్తుండగా.. సోదాలు నిర్వహించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఐదుగురు వ్యక్తులను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నా అక్రమార్కులు మారడం లేదు. కొత్త పద్ధతులను అవలంభిస్తూ బంగారం రవాణా చేస్తూ అధికారులకు చిక్కుతున్నారు.