byసూర్య | Wed, Mar 31, 2021, 11:41 AM
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(ఎఫ్బీవో) పోస్టుల భర్తీకి సంబంధించి టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన చేసింది. అభ్యర్థులకు ఏప్రిల్ 6వ తేదీన నడక పరీక్ష నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని మేడిపల్లి శాంతివనం పార్క్ లో ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 5 గంటలకు నడక పరీక్ష ప్రారంభమవుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎఫ్బీవో పోస్టుల భర్తీ కోసం గతేడాది అక్టోబర్ నెలలో మూడో విడత నడక పరీక్ష నిర్వహించారు. ఈ నడక పరీక్షలో 390 మంది అభ్యర్థులు అర్హత సాధించారని టీఎస్పీఎస్సీ తెలిపింది. 4వ విడత అర్హత పరీక్షకు రాత పరీక్షలో మెరిట్ ప్రకారం 823 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇప్పుడు నాలుగో విడత నకడ పరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ సిద్ధమైంది.