byసూర్య | Tue, Jan 19, 2021, 12:08 PM
రైతుల ఉద్యమానికి సంఘీభావంగా ,పెట్రోల్, డీజిల్ అధిక ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ టిపిసిసి, ఏఐసిసి సభ్యులు, మేడ్చల్ మాజీ శాసనసభ్యులు కిచ్చెన్న లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.ఈమేరకు మంగళవారం ఉదయం "రాజ్ భవన్ ఘెరావ్" కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేసి మేడ్చల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్ట్ కాబడిన వారిలో మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేగు రాజు, మేడ్చల్ మున్సిపల్ కౌన్సిలర్లు చాప రాజు, రాఘవేందర్ గౌడ్, పాతూరి సుధాకర్ రెడ్డి, రఘుపతి రెడ్డిలు ఉన్నారు.