కాళేశ్వరం ఆలయంలో సీఎం కేసీఆర్‌ దంపతుల పూజలు

byసూర్య | Tue, Jan 19, 2021, 11:55 AM

కాళేశ్వరం పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్‌ తొలుత సతీసమేతంగా కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి సీఎం దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు దగ్గరుండి సీఎం దంపతులతో స్వామివారికి అభిషేకం చేయించి, ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.


సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ దర్శనం తరువాత మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌లో కాళేశ్వరం రిజర్వాయర్‌ను పరిశీలించనున్నారు. అటు తరువాత లక్ష్మీ బరాజ్‌కు చేరుకొని అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. యాసంగికి సాగునీటి విడుదల తదితర అంశాలపై అధికారులతో ఆయన మాట్లాడనున్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM