విషాదం.. ప్రేమ జంట ఆత్మహత్య

byసూర్య | Tue, Jan 19, 2021, 01:16 PM

తమ పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ఓ ప్రేమ జంట పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. త‌ల‌మ‌డుగు మండ‌లం ద‌హెగాంకు చెందిన శ్రీరామ్‌(23), సుజాత‌(20) గ‌త కొంత‌కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయాన్ని త‌మ త‌ల్లిదండ్రుల‌కు చెప్పారు. పెళ్లి చేసుకుంటామ‌ని అడిగారు. కాని వారి పెళ్ళి ప్ర‌తిపాద‌న‌ను పెద్ద‌లు తిర‌స్క‌రించారు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన ప్రేమికులు.. పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యకి పాల్పడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Latest News
 

ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనలు ఖరారు Wed, Apr 24, 2024, 03:15 PM
యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM