byసూర్య | Mon, Jan 18, 2021, 01:41 PM
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ధరణి పోర్టల్ వ్యవస్థ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతుంది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూమల వ్యవహారాలను సులభతరం చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సర్వే నంబర్ల మిస్సింగ్, విస్తీర్ణంలో తేడాల సవరణలు ధరణి పోర్టల్ లో దరఖాస్తులు చేసిన వారంలోగా అప్డేట్ అయిన ఈ పాస్ బుక్ లింక్ ఎస్ఎంఎస్ రూపంలో రైతుకు ఫోన్ కి వెళ్లేలా చర్యలు తీసుకుంటుంది. ఆ తర్వాత ఇంటి చిరునామాకు పాస్ బుక్ పంపించనున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. అయితే ఈ విషయంలో ఫైనల్ నిర్ణయం కలెక్టర్లదేనని తెలిపింది. అయితే మార్పులు చేర్పులు చేసే అధికారాలు మాత్రం తహాశీల్ధార్లకు ఉందని ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.