byసూర్య | Wed, Jan 13, 2021, 01:18 PM
రేషన్ దుకాణాల్లో బయోమెట్రిక్ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికే యోచన చేస్తోంది. ఫిబ్రవరి నుంచి ఓటిపి పద్ధతిని పకడ్బందీగా అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. లబ్ధిదారుల్లో 30 శాతం మందికి ఆధార్ తో మొబైల్ లింక్ లేనట్లు తేలింది. ఇందుకోసం మీ-సేవ కేంద్రాల్లో మొబైల్ నంబర్ లింక్ చేయించుకోవాలని డీలర్లు సూచిస్తున్నారు.