byసూర్య | Mon, Jan 11, 2021, 10:47 AM
హైదరాబాద్ : నగరంలోని నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. నిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలోని మిలినియమ్ బ్లాక్ వద్ద వ్యక్తి ఉరేసుకున్న విషయాన్ని పోలీసులు ధృవీకరించారు. మృతుడి వయసు 40 ఏండ్లు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పంజాగుట్ట పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.