byసూర్య | Mon, Jan 11, 2021, 09:48 AM
తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ కొద్ది సేపటి కిందట విడుదల చేసిన బులిటెన్ మేరకు తెలంగాణలో గత 24 గంటల్లో అంటే మొన్న రాత్రి 8 గంటల నుంచి నిన్న రాత్రి 8 గంటల వరకూ రాష్ట్రంలో కొత్తగా 351 మంది కరోనా బారిన పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,89,784 కి చేరింది. అదే సమయంలో ఇద్దరు కరోనా కాటుకు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 1565కి పెరిగింది.