byసూర్య | Sun, Jan 10, 2021, 09:42 AM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 37,451 కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 351 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,89,784కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,565కి చేరింది. కరోనాబారి నుంచి నిన్న 415 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 2,89,784కి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 4,756 ఉండగా వీరిలో 2,584 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 72,53,236కి చేరింది.