సూట్‌కేసులో వ్యక్తి మృతదేహం

byసూర్య | Sun, Jan 10, 2021, 09:29 AM

నగరంలోని రాజేంద్రనగర్‌లో సూట్‌కేస్‌ కలకలం సృష్టించింది. డెయిరీ ఫామ్ వద్ద అనుమానాస్పదంగా కనిపించిన సూట్‌కేసులో వ్యక్తి మృతదేహం వెలుగు చూసింది. ఈ ఘటనతో పోలీసులతో పాటు స్థానికులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. చనిపోయిన వ్యక్తిని చాంద్రయాణగుట్టకు చెందిన జేబుదొంగ రషీద్‌గా గుర్తించారు. వివరాల్లోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తీ చంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన రియాజ్, ఫయాజ్, ఫిరోజ్‌ స్నేహితులు. రెండు రోజలు కిందట ముగ్గురూ మద్యం మత్తులో గొడవ పడ్డారు. మాటమాట పెరిగి గొడవ ముదరడంతో రిజాయ్‌ను మరో ఇద్దరు కలిసి చంపేశారు. విషయం బయటకు తెలియకుండా గుట్టుగా శవాన్ని ఓ సూట్‌కేసులో పెట్టి రాజేంద్రనగర్‌లోని ఓ డెయిరీ ఫామ్‌ వద్ద పడేశారు.


అయితే.. రియాజ్‌ కనిపించకపోవడంతో కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రియాజ్‌ స్నేహితులైన ఫయాజ్‌, ఫిరోజ్‌లను విచారించారు. దీంతో హత్యోదంతం వెలుగులోకి వచ్చింది. రియాజ్‌ను హత్య చేసి సూట్‌కేసులో పెట్టి రాజేంద్రనగర్‌ పీఎస్ లిమిట్స్ డైరీ ఫామ్ చౌరస్తా సమీపంలో పడేసినట్లు చెప్పారు. రాజేంద్రనగర్‌ పోలీసుల సహకారంతో చాంద్రయాణగుట్ట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సూట్‌కేస్‌ తెరిచి చూడగా.. రియాజ్‌ మృతదేహం కనిపించింది. అనంతరం మృతదేహాన్ని మార్చూరీకి తరలించారు. నిందితులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM