గుండెపోటుతో రాజన్న ఆలయ ఉద్యోగి మృతి

byసూర్య | Sun, Jan 10, 2021, 10:55 AM

వేములవాడ: రాజన్న సిలిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో రికార్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న లాల రాజు (40) గుండెపోటుతో మృతి చెందారు. బద్దిపోచమ్మ వీధిలో నివాసముండే రాజు నిద్రలోనే గుండెపోటు రావడంతో మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజు మృతి పట్ల ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పీ రంగారావు, రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల జేఏసీ కో చైర్మన్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్ తదితరులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM