byసూర్య | Sun, Jan 10, 2021, 10:55 AM
వేములవాడ: రాజన్న సిలిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న లాల రాజు (40) గుండెపోటుతో మృతి చెందారు. బద్దిపోచమ్మ వీధిలో నివాసముండే రాజు నిద్రలోనే గుండెపోటు రావడంతో మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. రాజు మృతి పట్ల ఆలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పీ రంగారావు, రాష్ట్ర దేవాలయ ఉద్యోగుల జేఏసీ కో చైర్మన్ ఉపాధ్యాయుల చంద్రశేఖర్ తదితరులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.