byసూర్య | Sat, Jan 09, 2021, 03:48 PM
బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టయి చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను వైద్య పరీక్షల నిమిత్తం జైలు సిబ్బంది శనివారం మధ్యాహ్నం ఉస్మానియా దవాఖానకు తరలించారు. శుక్రవారం అఖిలప్రియ తరపు న్యాయవాది ఆమె ఆరోగ్య పరిస్థితిపై సికింద్రాబాద్ కోర్టులో మెమో దాఖలు చేశారు. జైలులో అఖిలప్రియ కిందపడటంతో ముక్కు, నోటి నుంచి రక్తం వచ్చిందని పేర్కొన్నారు.
చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించాలని, అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేసేలా జైలు అధికారులను ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. స్పందించిన కోర్టు అఖిలప్రియ ఆరోగ్య పరిస్థితిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను ఆదేశించింది. ఈ మేరకు జైలు అధికారులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తీసుకెళ్లారు. అఖిలప్రియ హెల్త్ రిపోర్ట్ను జైలు అధికారులు సోమవారం కోర్టుకు అందజేయనున్నారు.