byసూర్య | Mon, Oct 19, 2020, 01:00 PM
నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. నాగూర్ కర్నూలు జిల్లాలోని బల్మూర్ మండలంలో ఉన్న బిల్లికల్లు ప్రాంతంలో ఒకే చెట్టుకు ఉరివేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.బలుమూరు మండలం రుసుల చెరువు అటవీ ప్రాంతంలో అఖిల, అనీల్ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. కానుగు చెట్టుకు ఉరి వేసుకుని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇద్దరు చెంచు జాతికి చెందిన వారుగా గుర్తించారు. అమ్మాయి బిల్లకల్లు, అబ్బాయి చెంచు గూడెం ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. గత రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు బైక్ మీద అటవీ ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి పొద్దు పోయిన తరువాత వీరిద్దరూ ఆత్మహత్య పాల్పడినట్లు సమాచారం. అయితే వీరిద్దరూ ఆత్మహత్యకు కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు.