byసూర్య | Mon, Oct 19, 2020, 12:34 PM
సోమవారం హైదరాబాద్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తమయ్యారు. మొన్నటి వర్షానికే ఇప్పటికీ పలు కాలనీలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల ప్రజలను జీహెచ్ఎంసీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముంపు కాలనీల్లో సహాయక చర్యలు కొనసాగిస్తూనే బాధితులకు పునరావాసం కల్పిస్తున్నారు అధికారులు. మొన్నటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు.