byసూర్య | Mon, Oct 19, 2020, 12:12 PM
రంగారెడ్డి : మీర్పేట పరిధిలోని చెరువులకు వరద ఉధృతి పెరిగింది. పెద్ద చెరువు, మంత్రాల, సందె చెరువుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. మీర్పేట చెరువు కట్ట బలహీనంగా మారింది. జలదిగ్బంధంలోనే పదుల సంఖ్యలో కాలనీలు ఉన్నాయి. ఈ క్రమంలో ట్రాక్టర్లలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు, ప్రజాప్రతినిధులు తరలిస్తున్నారు. చెరువు కట్ట తెగే ప్రమాదం ఉందని ప్రజలను కార్పొరేటర్లు అప్రమత్తం చేస్తున్నారు.